మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలో కల్వలనాగరం,బంగారిగూడెం,కన్నాయిగూడెం, బట్టుపల్లి తదితర గ్రామాలలో వర్షాకాలం సీజన్లో అలికిన వరి కరివేద,కంది పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ పరిశీలించి రైతులకు వరి కరివేద,కంది పంటల కలుపు నివారణ పై తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంది పంటలకు కలుపు నివారణకు విత్తనాలు చల్లిన 15-20 రోజుల వ్యవధిలో ఇమాజతాపైర్ 10% ఎస్ ఎల్ 300 ఎమ్ ఎల్ ఒక్క ఎకర పంటకు పిచికారి చెయ్యలన్నారు.అలాగే వరి కరివేద పంట కలుపు నివారణకు వరి ఇత్తనాలు చల్లిన 20 రోజుల తర్వాత లేదా రెండు నుండి నాలుగు ఆకుల దశలో బిస్ పారిబిక్ సోడియం 10% ఎస్సీ 20 ఎమ్ ఎల్ మందును ఒక్క ఎకరకు లేదా కౌన్సిల్ 60 గ్రాములు ఎకరానికి పిచికారి చెయ్యలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అనిల్ ప్రశాంత్ పాల్గొన్నారు.
Post A Comment: