మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నందు ముస్లిం మత పెద్దలతో ఎస్ఐ శ్రీకాంత్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మండలంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లింలకు అతి పవిత్రమైన పెద్ద పండుగలలో బక్రీద్ ఒకటని అన్నారు. మండలంలో కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నందున అందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని కోరారు. త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు జరుపుకునే పండుగలలో బక్రీద్ పండుగ ప్రత్యేకమైనదని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో షేక్ ఆరీఫ్,గులాం సమద్, షేక్ మస్తాన్ వలీ,షేక్ సిద్దిఖ్,షేక్ నాగుల్ మీరా,షేక్ షఫీ,పాల్గొన్నారు.
Post A Comment: