CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్సీ రైతుల భూమి ప్రభుత్వ కార్యక్రమాల సాకుతో గుంజు కోవద్దు.

Share it:


👉ఎస్సీ రైతుల సాగులో ఉన్న భూములను ప్రభుత్వ అధికారులు గుంజుకునే విధానం సరైంది కాదన్నారు.

 మన్యం టీవీ కొత్తగూడెం జూలై 9 :- శుక్రవారం నాడు

కొత్తగూడెం పట్టణ స్థానిక అంబేద్కర్ భవన్లో విలేకర్ల సమావేశంలో ఏజెన్సీ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ తరతరాలుగా వంశం పరంగా ఎస్సి రైతులు సాగు చేసుకుంటూ వస్తున్న భూములను ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్,నిర్మాణం పల్లె ప్రకృతి,పట్టణ పకృతి, వైకుంఠధామం,కార్యక్రమాల పేర్లతో మండల అధికారులు ఏజెన్సీ చట్టాలను బూచిగా చూపి అండదండ లేని రైతులను ఆదరించి, బెదిరించి,బలవంతంగా, భూములను గుంజుకునే విధానాలు విరమించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బహిరంగంగా ఎస్సీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రగతి భవన్ సాక్షిగా వెల్లడించారు మండల స్థాయి అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానాన్ని విస్మరించి ఎస్సి రైతుల భూములకు రక్షణ కల్పించాల్సిది పోయి రాక్షసుల్లా బాక్షిస్తున్నారని ఆయన వాపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి ఎస్సీ రైతుల సాగులో ఉన్న భూములకు రైతుబంధు,రైతు రుణమాఫీ, రైతు బీమా,అందజేసి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు,     ఈ కార్యక్రమంలో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర జిల్లా నాయకులు, గద్దల బాబురావు, కుసపాటి శ్రీనివాస్,సుధానల రవి, గంగపూరి శ్రీను రాయల, గౌతమ్ రాజు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: