CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ స్థాయి కవితా పోటీలలో మేడిపల్లి సాయి ప్రతిభ

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


ISO గుర్తింపు పొందిన శ్రీ శ్రీ కళా వేదిక నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీలో బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మేడిపల్లి సాయి రాసిన కవిత ఉత్తమ కవితగా ఎంపిక అవ్వడం జరిగినది.శనివారం ప్రకటించిన ఫలితాలలో శ్రీ శ్రీ కళా వేదిక వారు మేడిపల్లి సాయి గారికి ప్రశంసా పత్రాన్ని అందచేశారు.

అన్నదాత ఆకలి కేకలు అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలో 346 మంది పలు రాష్ట్రాల తెలుగు కవులు పాల్గొనగా అందులో ఉత్తమ కవితగా మేడిపల్లి సాయి కవిత ఎంపిక కావడం జరిగినది. శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ జాషువా అవార్డ్ గ్రహీత Dr. కత్తి మండవ ప్రతాప్ గారి సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలలో సామాజిక అంశాలనే ఇతివృత్తంగా చేసుకుని కవితా పోటీలను నిర్వహిస్తూ ఉండటం గమనార్హం.అందులో కవులందరూ కూడా వారి వారి దృష్టి కోణాలకు కవితా రూపం ఇవ్వడం అద్భుతమైన విషయము.అదేవిధంగా భద్రాద్రి సాహితీ వేదిక వారి నుండి హరివిల్లు కవిభూషన్ అవార్డ్ సైతం మేడిపల్లి సాయి గారు అందుకున్నారు. పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తూనే కరోనా కష్ట కాలంలో హెల్పింగ్ హార్ట్స్ అనే సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక వారు అందించిన జాతీయ స్థాయిలో ఉత్తమ కవితగా ఎంపికవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: