✍️బట్ట భిక్షపతి ,మన్యం మనుగడ ప్రతినిధి
మన్యం మనుగడ, కరకగూడెం
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టీఏ రాజుపై పాత సాంవ్లీ గ్రామ పంచాయితీ సర్పంచ్ పెట్రోల్ పోసి నిప్పంటించినందుకు సర్పంచ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, సాంకేతిక సహాయకుడు రాజు పైన జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం, కరకగూడెంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలోయంపిడిఓ డి.శ్రీను, . పి.క్రిష్ణకుమారి,అదనపు కార్యక్రమ అధికారి. ఆర్.సందీప్,ఇంజనీరింగ్ కన్సల్టెంట్.పంచాయితీ కార్యదర్శి ప్రెసిడెంట్:బి.వెంకటెష్ మరియు మండలంలోని జూనియర్ పంచాయితీ కార్యదర్శులు. సాంకేతిక సహాయకులు: జి.పాపారావు, పి.క్రిష్ణయ్య, కె.నాగరాజు, కంప్యూటర్ ఆపరేటర్స్ కమ్ అకౌంట్స్ అసిస్టెంట్ : పి.శంకర్ రావు మరియు బి.మల్సూర్, కార్యాలయ జూనియర్ సహయకులు:టి.డి.హరినాధ్ బాబు, ఈ-పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్స్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: