*సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ చిత్రపటాలకు పాలాభిషేకం.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో దళితవాడలో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్,మంత్రి సత్యవతి రాథోడ్,ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ ల చిత్రపటాలకు టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వావిలాల రాంబాబు మరియు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా దళితులు ఆర్థిక స్వాలంబన లేక అంటరాని వారిగా ఊర్లకు దూరంగా ఉన్నారని, దళితులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని,మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి ఆదర్శంగా ఒక మోడల్ స్కీం లాగా దళిత బంద్ కు రెండు వేల కోట్లు ప్రవేశపెట్టారని,దళితులు స్వయంకృషితో ఎదిగే విధంగా పరిశ్రమలు సాధించే విధంగా అధికారుల పర్యవేక్షణలో దళితులు ఎదిగే విధంగా ఊరికి ఒక ఐఏఎస్,ఐపీఎస్ ఆఫీసర్ లతో ప్రతి నియోజకవర్గంలో పర్యవేక్షణ జరిపించాలని ఇలాంటి దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని లాంటి నాయకున్ని ఇంతవరకు చూడలేదు లేదని అన్నారు.దళితులు పక్షపాతి అని అన్నారు. దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి సాధించాలంటే అన్ని రంగాలలో దళితులు అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామ నరసయ్య, పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు కునూరు మహేష్ గౌడ్,ఎంపీటీసీ స్వప్న చంద్రబాబు,జాడి బొజరావు, ఎండి ఖాజాపాషా,కోమిరి రమేష్, ప్రభాకర్, కాళ్ల రామకృష్ణ కొండాయి చిన్ని, బట్టు కొమురయ్య, లోట పెట్టెల వి రాజేష్,వార్డు సభ్యులు దెపాక మల్లమ్మ,వావిలాల ముత్తయ్య, సతీష్, కొమురయ్య, నర్సింగరావు,లింగాచారీ, సుశీల,ఎల్లమ్మ,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: