టిఎంఎంఎన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి
మన్యం టీవీ మంగపేట.
గత మూడు రోజులు మంగపేట మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని దళిత వాడలు మురద మయంగా మరి నడవడానికి వీలు లేకుండా నీళ్లు నిలువ ఉండి ఎక్కడి వేసిన చెత్త అక్కడే ఉండి దుర్వాసన దోమలతో కాలనిలో ఉంటున్న వారు సీజనల్ వ్యాధులకు గురైయ్యే అవకాశం ఉందని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి అన్నారు.వైద్య అధికారులు గ్రామాల్లోని దళిత వాడలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ అధికారులు బురద నీళ్లు నిలువ ఉన్న దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లి శానిటేషన్ పనులు చేసి ఇంటి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు జరిపి గ్రామాల్లో పర్యటించి కరోనా పరీక్షలు చేయాలని బుచ్చంపేట గ్రామంలో కరోనా కేసులు ఎక్కువ మొత్తంలో నమోదు అవుతున్న అధికారులు కేసులను బయట పెట్టకుండ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంకా ఎక్కువ మొత్తంలో కరోనా కేసులు ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని బుచ్చంపేట గ్రామంలో వైద్య అధికారులు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి డిమాండ్ చేస్తున్నారు.
Post A Comment: