CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అర్హులైన పేదవారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన బి ఎస్ పి మండల అధ్యక్షులు తంబర్ల..

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ఎంపీడీవో కి శుక్రవారం బి ఎస్ పి పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నర్సింహారావు అర్హులైన పేద వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతో కాలం నుంచి కొత్త పింఛన్లు రాక  అర్హులైన పింఛనుదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బి ఎస్ పి పార్టీ జూలూరుపాడు మండల మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల మాట్లాడుతూ.. అర్హులైన వారు పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకొని ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం అన్నారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరి చేయాలని కోరారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా వృద్ధులకు రెండు వేల రూపాయలు,  వికలాంగులకు మూడు వేల రూపాయలు, పింఛన్ ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వానిదేనని  ఆమె అన్నారు. అలాంటి ప్రభుత్వం సంవత్సరాల కొద్దీ పింఛన్లు ఆపటం ఏ పాటి న్యాయం అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాకటి లక్ష్మీనారాయణ, నీలాల జానికమ్మ, కంచ పోగు హక్కులమ్మ ,గోలి సుదర్శన్, మంద మంగులు, సంతానపు కాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: