మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదవశాత్తు శివ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు.సిస్మాన్ కంపెనీ క్రషర్ మిల్లులో శివ కుమార్ పనిచేస్తుండగా సూపర్వైజర్ క్రషర్ మిల్లును ఆన్ చేయడంతో శివ కుమార్ క్రషర్ లో పడి అక్కడికక్కడే మృతిచెందాడు.పినపాక మండలం,తోగ్గుడెం పంచాయితీ,గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన శివ కుమార్ భద్రాద్రి పవర్ ప్లాంట్ లో రోజు వారి కూలి గా పనిచేస్తున్నాడు.ఆదివారం ఉదయం శివ కుమార్ క్రషర్ దగ్గరకు వెళ్లిన సమాచారం తెలుసుకోకుండా సూపర్వైజర్ క్రషర్ ఆన్ చేయడంతో శివ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.అనంతరం కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలియకుండా శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపించారు.విషయం తెలుసుకున్న కార్మికులు ఆగ్రహంతో కంపెనీ హెచ్ఆర్ అధికారులను చితకబాదారు.ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్లాంటు వద్దకు చేరుకున్నారు.అక్కడ శివ మృతదేహం లేకపోవడం తో వారు ఆందోళనకు దిగారు.సమాచారం తెలుసుకున్న మణుగూరు సిఐ భాను ప్రకాష్ సిబ్బంది తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.కార్మికులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు.ఈ క్రమంలో శివ మృతదేహం ని చూపించాలి అని కుటుంబ సభ్యులు,కార్మికులు డిమాండ్ చేయడంతో, సిబ్బంది మృతదేహాన్ని తిరిగి తీసుకొని వచ్చారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ప్లాంట్ గేటు ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు.అనంతరం సిఐ భాను ప్రకాష్ మాట్లాడుతూ శివ మరణానికి గల కారణాలు తెలుసుకొని విచారణ నిర్వహిస్తామని తెలిపారు.
Post A Comment: