మన్యం టీవీ కొత్తగూడెం జూలై 13:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 32, 16వ వార్డులో రెండు రోజుల క్రితం మునిసిపల్ అధికారులు కూల్చివేసిన దుకాణ సముదాయన్ని మరియు రైల్వే అధికారులు పేదల ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసిన విషయాన్ని తెలుసుకుని, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడి,మంగళవారం మునిసిపల్ ఆఫీస్ లో ప్రజా ప్రతినిధులు అధికారులు రైల్వే అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమావేశంలో మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగితే సహించబోమని వారికి న్యాయం చేస్తానని నేను పేదల పక్షపాతి అని అన్నారు. పేద ప్రజలను ఎవరూ ఇబ్బంది పెట్టినా సహించేది లేదని అన్నారు.
ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్రరావు, మునిసిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కౌన్సిలర్లు కొల్లాపూర్ ధర్మరాజు, పరమేష్ యాదవ్, బండి నరసింహా, వేముల ప్రసాద్, కూరపాటి విజయలక్ష్మి, స్థానిక టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మునిసిపల్ అధికారులు రైల్వే అధికారులు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: