CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నర్సాపురంలో వ్యవసాయ పంటల వివరాల నమోదును పరిశీలించిన ఏ డి ఏ టి కరుణశ్రీ..

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు,

జూలై 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి టి కరుణశ్రీ వ్యవసాయ పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలకు ఆశించే చీడపీడల గురించి, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పంటలకు పిచికారి చేయాల్సిన మందుల గురించి వివరించారు. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తీవ్రత పంటల పై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో మందులు పిచికారి చేసినట్లయితే వీటిని పూర్తిగా అరికట్టవచ్చని అన్నారు. రైతులందరూ తమ వ్యవసాయ భూములలో సాగు చేసుకుంటున్న పంటల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. వెంట ఏఈఓ గోపికృష్ణ ఉన్నారు.

Share it:

Post A Comment: