మన్యం టీవీ కొత్తగూడెం జులై 5
సోమవారం సుభాష్ చంద్రబోస్ నగర్లోని మెక్కల వెంకటయ్య గృహాన్ని సందర్శించి మొక్కలు పెంపకాన్ని పరిశీలించారు. సమాజం పట్ల మీరు తీసుకుంటున్న చర్యలు ఎంతో అమూల్యమైనవని అతన్ని శాలువాతో ఘనంగా సత్కరించారు. వయోవృద్ధులైనప్పటికీ మొక్కలు పెంపకం పట్ల మీ ఆసక్తి అమూల్యమైదని, చెట్లు పెంపకంపై విద్యార్థులకు అవగాహన కొరకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసిందని సమాజానికి మీరు ఎంతో పెద్ద సేవల చేస్తున్నారని చెప్పారు. మొక్కలు పెంపకాన్ని చేపట్టిన వ్యక్తుల గృహాన్ని సందర్శించి ప్రభుత్వం తరపున వారిని ఘనంగా సత్కరించాలని ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన జిల్లా కలెక్టర్లు సమావేశంలో సూచించారని చెప్పారు. వెంకటయ్య దంపతులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పెరటిలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి అర్జున్, తహసిల్దార్ రామక్రిష్ణ కౌన్సిలర్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: