జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా ద్వారా నిరుపేద మహిళకు చిరు వ్యాపారం ప్రారంభం.
మాన్యం టివి దుమ్ముగూడెం:మండలంలోని తురుబాక గ్రామానికి చెందిన అంతుకూరి వెంకట్రావు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తూ పక్షవాతంతో మంచాన పడటంతో ఆ కుటుంబానికి జీవనోపాధి కరువై భార్య మణెమ్మ దీనంగా జేడీ ఫౌండేషన్ సంప్రదించగా జే.డీ ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహకారంతో శ్రీమతి మణెమ్మ కి తోపుడు బండిపై ఫ్యాన్సీ సామాన్లు వ్యాపారాన్ని ఫౌండేషన్ బాధ్యులు శ్రీ మురళీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ భద్రాచలం బాధ్యులు శ్రీ మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు అర్ధించే స్థాయినుంచి ఆర్జించే స్థాయికి ఎదగాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉపాధి భరోసా ద్వారా ఇప్పటి వరకు 11 కుటుంబాల కు చిరు వ్యాపారాలు పెట్టించామని, వారందరూ వాళ్ళ కాళ్ళమీద నిలబడి సంతోషంగా ఉన్నారని తెలిపారు.తన ఆవేదన అర్థం చేసుకుని నాకు భరోసా కల్పించి జీవన ఉపాధి కల్పించిన జే.డీ ఫౌండేషన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జే.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, పవన్ కుమార్, అంబికా సురేష్, ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి , యూసఫ్ మియా, శివ కుమార్, శంకర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: