👉 సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్
మన్యం టివి:ములకలపల్లిమండలం: గత మే నెల లో పోసిన ప్రధాన మంత్రి షడక్ రోజ్ గార్ యోజన పథకం క్రింద ములకలపల్లి గ్రామ పంచాయితీ ఆఫీసు నుండి ముకమామిడి వరకు పోసిన రోడ్ పనులు నాణ్యత పాటించకుండా పనులు పూర్తి చేశారని,ఈ విషయం పై సీపీఐ ఆధ్వర్యంలో ఎంపీటీసీ కొర్రీ భద్రం. జాబ్బర్,ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు తూతూ మంత్రం వచ్చి మ మా అనిపించుటకు జాగ్రత్తలు పడ్డారు. రోడ్ పోసి నెల రోజులకే పగుళ్లు రావటం,పెచ్చులు లేవటం, సైడ్ లోపోసిన మట్టి కుంగి పోవటం తో పాటు సైడ్ పోసిన మట్టి మొత్తము కొట్టక పోతుందని ఈ విషయంలో అధికారులకు స్పాట్ లో చూపించినా స్పందిచకుండా ఉంటూ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని కాంట్రాక్టర్లు తో మల్లీ చెపిస్తామని దాట వేశారని, రోడ్ తనిఖీ చెయ్యాల్సిన అదికారులు స్థానిక కాంట్రాక్టర్లతో,అధికార్ల తో కుమ్మక్కు అయ్యారని, సీపీఐ రాష్ట్ర సమితి సబ్యలు నరాటిప్రసాద్ఆరోపించారు.తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి రోడ్ నాణ్యత పై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కీసరి గంగ రాజు. గడ్డం వెంకటేశ్వర్లు. కీసరి కృష్ణ. ముత్యాలు. తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: