గుండాల జూలై 5 (మన్యం టీవీ) కరోనా బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు సత్తు లాల్. బాటఅన్న నగర్ గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సత్తు లాల్ అదే గ్రామానికి చెందిన 17 కుటుంబాలు కరోనా బారిన పడడంతో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇద్దరు వారి పాఠశాల తరఫున నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామంలో ఉన్న పాఠశాలలో పనిచేస్తుండటంతో గ్రామస్తులతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఆ బంధం తోనే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు వీరన్న , గ్రామ పెద్దలు , యువకులు పాల్గొన్నారు
Post A Comment: