గుండాల జులై 22 (మన్యం మనుగడ) నిరుద్యోగ సమస్యలపై ఈనెల 29న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీ వై ఎల్ రాష్ట్ర నాయకులు పొడుగు జనార్ధన్ కోరారు. గురువారం మండలం పరిధిలోని వెన్నెల బైలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు నిరుద్యోగ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడున్నర సంవత్సరాలు గడిచిన నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు. నిరుద్యోగ సమస్యపై తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిన్నెర కృష్ణ , స్వామి, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: