మన్యంటీవీ, అశ్వారావుపేట: అభి హెల్ప్ లైన్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ సహకారంతో అక్షర భారత్ -అక్షర వెలుగు విద్య ప్రాజెక్ట్ విద్యాబోధన కేంద్రాన్ని అశ్వారావుపేట మండలం జమ్మి గూడెం గ్రామ పంచాయతీలో ఆదివారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద కులం మతం అనే విభేదాలు లేకుండా చదువుకోవాలని మరియు చదువుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు ఎంసిఓలు అనుమంతురావు, దస్తగిరిలు తెలియజేశారు. అక్షరాస్యతతోనే దేశప్రగతి సాధ్యమని ఎంపీటీసీ కాసాని దుర్గ, జమ్మిగూడెం ఇంచార్జ్ సర్పంచ్ పెన్నాడ సూర్య ప్రభ అన్నారు. అక్షరాలు నేర్చుకునేందుకు నిరక్షరాస్యులు మందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబెర్ దానపు జగపతి, పెన్నాడ ఏసు పంచాయితీ విసీఏ లు యాట్ల గంగ భవాని, తోకల సాయి భరద్వాజ్, అంగన్వాడీ లు యువకులు తోట రాజేంద్ర ప్రసాద్, గణప నవీన్, రాజిన శ్రీను మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: