మన్యం టీవీ కొత్తగూడెం, జూలై 20 :- ఇటీవల బైక్ డీ కొని కాలువిరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న టేకులపల్లి మండలం శంభుని గూడెం నివాసి కనకం వెంకటేశ్వర్లు దీన స్థితిని భద్రాద్రి కొత్తగూడెం అమృత హాస్పిటల్ మేనేజర్ బచ్చలికూర కరుణాకర్ అతని ఫ్రెండ్స్ దిలీప్, లక్మణ్, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని తన మిత్రుల ద్వారా 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించి మానవత్వాన్ని చాటారు.
కొత్తగూడెం పట్టణం శ్రీరామ కళ్యాణ మండపంలో వాచ్ మెన్ గా కనకం వెంకటేశ్వర్లు అతని కుటుంబం పనిచేస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఓ ఇద్దరు యువకులు బైక్ మీద వేగంగా వచ్చి వెంకటేశ్వర్లు ని డీ కొనగా, తలకు బలమైన గాయం కాగా,కుడి కాలువిరిగింది. ఈ దుర్ఘటనతో ఆ నిరుపేద కుటుంబం మరింత దీనంగా మారింది, ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెలుసు కున్న బచ్చలి కూర కరుణాకర్ గొప్ప మనసుతో వెంటనే స్పందించి తన మిత్రులకు చెప్పగా ఖమ్మం నివాసి ఉదయ్ కుమార్ , బిజేపీ పట్టణ యూత్ అధ్యక్షులు దిలీప్ కుమార్, లక్మణ్, ఫయాజ్, సన్నీ, ఉపెందర్, కృష్ణ తేజా, కేసుపాక సాయి కుమార్, రంజిత్, పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కోసం అందించి మానవత్వాన్ని చాటి, ఆదర్శంగా నిలిచారు.
ఈ సహయాన్ని బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు సిద్దెల రవి, ఐక్య అంబేద్కర్ విగ్రహ ఆశయ సాధన సమితి నాయకులు వేల్పుల భాస్కర్, సంఘం సీనియర్ నాయకులు కత్తి వెంకన్న ల సమక్షంలో ఆ కుటుంబానికి అందజేశారు. భవిష్యత్తులో మెరుగైన వైద్యం కోసం తమ వంతు సహాయం ఉంటుంది అని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.
Post A Comment: