మన్యం టీవీ,బూర్గంపాడు:
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు శనివారం ఉదయం 52 అడుగులకు చేరే అవకాశం ఉంది. సారపాక, బూర్గంపాడు,నాగినేనిప్రోలు, మోతె,ఇరవెండి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ గ్రామాలలో తక్షణమే పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేయాలి.అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి. స్థానిక ప్రజాప్రతినిధుల ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి. వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Post A Comment: