గిరిజనుల ను వెంటనే విడుదల చేయాలి.
టేకులపల్లి :
సిద్దారం గిరిజనుల పై ఫారెస్ట్ దాడులు అన్యాయమని,వారిపై పెట్టిన అక్రమ కేసులు తొలిగించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు, మంగళవారం నాడు సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాప్రంట్ పార్టీ ల ఆధ్వర్యంలో సిద్దారం గ్రామం లో పోడు రైతుల తో జనరల్ బాడీ సమావేశం జరిగింది,ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఊక్లా, సీపీఐ మండల న్యూ డెమోక్రసీ మండల నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు, ధర్మపురి వీరబ్రహ్మచారి,టిపీఎఫ్ జిల్లా నాయకులు సంజీవరావు లు మాట్లాడుతూ సిద్దారం గ్రామం లో ఫారెస్ట్ అధికారులు అటవీ హక్కుల చట్టం ప్రకారం సర్వే చేసిన భూములలో కందకాలు త్రవ్వి,ఆభూమి స్వాధీనం చేసుకోవాలని చూడటం వల్లే గిరిజనుల లో ఆందోళన నెలకొందని అన్నారు, వాస్తవంగా గౌరవ హైకోర్టు తీర్పు ప్రకారం ఫారెస్ట్ అధికారులు ఆభూములలోకి వెళ్ళవద్దు కానీ ఫారెస్ట్ అధికారులు పోవటం వల్ల ఘర్షణ జరిగింది, పోలీసులు గిరిజనుల కేసులు పెట్టడం అన్యాయం అని వారిని విడుదల చేయాలి అని కోరేరు.
Post A Comment: