టి.పీసీసీ చీఫ్గా నియమితులైన రేవంత్రెడ్డిపై సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు అంశాలపై స్పందించారు.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటున్నాడు.. మరి.. డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండ్ గా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, ఈటల రాజేందర్ ను తీసుకెళ్లి ఇంట్లో పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ పెంచుకున్నాడన్న సుమన్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పని చేయకుండా అవతలోడికి పని చేసిన వ్యక్తి ఆయన అంటూ ఫైర్ అయ్యారు..
Post A Comment: