గుండాల జూలై 15 (మన్యం మనుగడ) నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పీ వై ఎల్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పీ వై ఎల్ జిల్లా అధ్యక్షులు చింత నరసింహారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీ వై ఎల్ రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్నారు. రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాటమీద నిలబడలేదు అన్నారు. త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వజ్జ మధు, సహాయ కార్యదర్శి అట్టి కం శేఖర్, బొగ్గవరపు రాజు, ఎనుగంటి లాజర్, పునెం సమ్మయ్య, మంగ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: