CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Share it:

 



పినపాక మండల తహశీల్దార్ వెంకట విక్రమ్ కుమార్,

 ఏడూళ్ల బయ్యారం సీఐ దోమల రమేష్ 


మన్యం మనుగడ, పినపాక: గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వానల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది అని, పినపాక మండలం లోని గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, గంగపుత్రులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని పినపాక మండల తహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్, ఏడూళ్ల బయ్యారం సిఐ దోమల రమేష్ సూచనలను చేయడం జరిగింది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవాహ వేగం పెరుగుతున్న కారణంచేత, పినపాక మండల తాహసిల్దారు, ఏడూళ్ల బయ్యారం సిఐ దోమల రమేష్ లు మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతం టి. కొత్తగూడెం కు వెళ్లి వరద ప్రవాహాన్ని గురించి చర్చిస్తూ, మండలంలోని ప్రజలకు సూచనలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం ఎస్ ఐ టి వి ఆర్ సూరి, టిఆర్ఎస్ నాయకులు దాట్ల వాసు బాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: