మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గోదావరి పై నిర్మిస్తున్న సీతమ్మ ప్రాజెక్టు వలన రెండు పంటలు పండే భూములు కోల్పోయి, నిర్వాసితులు అవుతున్న రైతులకు న్యాయమైన నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు.కనకయ్య,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కమిటీ సభ్యులు,శాఖ కార్యదర్శుల సమావేశం బొల్లం.రాజు అధ్యక్షత న సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వలన మణుగూరు, అశ్వాపురం,చర్ల,దుమ్మగూడెం మండల రైతులు సర్వం కోల్పోయి,తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి భూములకు ఒక ఎకరానికి 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని,మిగిలి ఉన్న వ్యవసాయ భూములకు సాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిర్దిష్టంగా సర్వే చేసి నిర్వాసితులను గుర్తించి వారికి ప్యాకేజీ చెల్లించిన తర్వాతే,ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని లేనిపక్షంలో ప్రాజెక్టును అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మణుగూరు, కరకగూడెం మండల కార్యదర్శులు కాటి బోయిన. నాగేశ్వరరావు,సత్ర పల్లి. సాంబశివరావు,సీనియర్ నాయకులు నెల్లూరి. నాగేశ్వరరావు,మడి నరసింహారావు,ముల్కల, ఉత్తం పల్లి చంద్రయ్య,తోట. పద్మ,వై.రంగయ్య,తాటి. నరసింహారావు,ఎస్ లక్ష్మయ్య,నందన్,ఈశ్వర్ రావు,కలబోయిన.మాధవరావు,గుండి.భీమయ్య,నైనాల. నాగలక్ష్మి,కోవాసి.వెంకట్,పల్లపు.వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: