కొత్తగూడెం మున్సిపాలిటీ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన : ఎమ్మెల్యే వనమా
మన్యం మనుగడ, భాద్రద్రి కొత్తగూడెం:
కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కొత్తగూడెం మున్సిపాలిటీ 36వార్డ్ లలోని సుమారు 59,06844 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక గొప్ప వరమని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేద కుటుంబానికి పెద్ద కొడుకు గా మారాడు అని అన్నారు. పేదలకు ఏ కష్టమొచ్చినా ఎమ్మెల్యే వనమా ఎప్పుడూ అండగా ఉంటారని ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు రుకు మెందర్ బండారి, పరమేష్ యాదవ్, బండి నరసింహా, బాలిశెట్టి సత్యభామ, సాహార బేగం, వనచర్ల విమల, గుమ్మడవెల్లి కళ్యాణి, అజ్మీర సుజాత, వడ్డీది సుజాత, మాదా సత్యవతి, వేముల ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, డైరెక్టర్ బాలాజీ నాయక్, టిఆర్ఎస్ నాయకులు కంభంపాటి దుర్గాప్రసాద్, రావి రాంబాబు, మసూద్, సుందర్ రాజ్, యూసుఫ్, పిల్లి కుమార్, మోరే రమేష్, మాద శ్రీరాములు, కొండా స్వామి, విజయ్, 22 వ వార్డు యాకూబ్, సురేందర్, ఆవునూరు చంద్రయ్య, దూడల కిరణ్, కరాటే శీను, జానీ, సందీప్, వనమా రాము, ఈశ్వర్, ఏనుగుల శీను మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.
Post A Comment: