మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లయన్స్ క్లబ్ మణుగూరు ఆధ్వర్యంలో,క్లబ్ ప్రెసిడెంట్ పొత్తంశెట్టి.నాగేశ్వర రావు అధ్యక్షతన గురువారం డాక్టర్స్ డే వేడుకలను,స్థానిక మణుగూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రోగ్రాం ఛైర్మెన్ గా పిల్లారిషెట్టి.హరిబాబు మాట్లాడుతూ,కరోనా మహమ్మారి ను అంతం చేసే మహా యజ్ఞంలో,రాత్రనక, పగలనక పని చేస్తున్నారని, కరోనా పేషంట్స్ కు వైద్యం అందించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు,ప్రతీ ఒక్కరి సేవలు మాటల్లో వర్ణించలేనిది అని అన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను అభినందించారు. మణుగూరు మండల పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో పని చేస్తున్న డాక్టర్లు మౌనిక,ప్రకాష్ లను మరియు మణుగూరు ప్రముఖ డాక్టర్లు గాజుల. కోటేశ్వరరావు,బుడగం. రామకృష్ణ,శశిధర్,జయశ్రీ, మధుసూదన్ రావు, సమ్మయ్య,బాలకృష్ణ ను, పుష్ప గుచ్చం అందజేసి, మెమెంటో ను అందించి, శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ గాజుల పూర్ణ చందర్ రావు, కోశాధికారి భూక్యా తార, పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణా మోహన్,గాజుల.రమేష్ కుమార్,చంద్ర మోహన్,తార ప్రసాద్,గంట.రమేష్,చంద్ర శేఖర్,లయన్స్ క్లబ్ సభ్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: