మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని పినపాక గ్రామంలో పీపుల్స్ వెల్ఫేర్అసోసియేషన్ డైరెక్టర్ జెస్సీపాల్ రెబ్బవరపు అధ్యక్షతన కరోనాతో బాధపడుతున్న 18 కుటుంబాలకు 25 కేజీల బియ్యం , నెలకు సరిపడిన కిరాణా సరుకులు అలాగే వాటితో పాటు శానిటైజర్,
మాస్కులు మరియు టాబ్లెట్స్ కలిగిన కిట్లు అందించారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ప్రతి జిల్లాలో 100 కుటుంబాలకు ఈ సహాయం చేయుచున్నారు. పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలబడి, సహాయం చేయడంలో మా సంస్థ ఎల్లప్పుడూ ముందు వుంటుందని తెలియజేశారు. పేదలను కష్ట కాలంలో హక్కున చేర్చుకుని వారిని ఆదరించడమే నిజమైన సమాజ సేవ అని మరొకసారి ఋజువు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాస్టర్ శామ్యూల్ రాజు మండలం నాయకులు పాస్టర్ కె. ప్రవీణ్, పాస్టర్ టి. కార్నెలి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: