CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుదాం.

Share it:

 


ఏడవ విడత హరితహరంలో భాగంగా మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

మన్యం టీవీ కరకగూడెం:మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుదాం అని ప్రభుత్వ విప్ పినపాక  శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు.మండల పరిధిలోని వీరపూరం క్రాస్ రోడ్డు వద్దగల కొమరం భీమ్ విగ్రహం దగ్గర ఏడవ విడత హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు.అనంతరం తడి పోడి చెత్త బుట్టలను పంపిని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు భాగుండాలంటే మొక్కలు పెంపకం చాల అవసరం అని,చెట్లను నరకడం వలన చెట్ల సాంద్రత తగ్గిపోయి ప్రాణవాయువు ఆక్సిజన్ వాయువు తగినంతగా లభించడం లేదు అన్నారు.పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని సాకరం చేసే దిశగా హరిత హారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ జన్మ హక్కుగా భావించి మొక్కలు విరివిగా  మొక్కలు నాటాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా, స్థానిక సర్పంచ్ తొలెం నాగేశ్వరరావు, స్పెషల్ అధికారి బాబూరావు, తహశీల్దారు శివయ్య, ఎంపీడిఓ శ్రీనివాస్, అర్ఐ బాబు ,సెక్రటరీ చిరుమళ్ళ సర్పంచ్ పాయం నర్సింహరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ ,యువజన  నాయకులు పూజరి క్రిష్ణ, గుమ్మడెల్లి ప్రసాద్, వేణు ,కటకం లెలిన్ , ఎగ్గడి శ్రీను ,దిలీప్ , ఎలిపెద్ది శ్రీను ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: