మన్యం మనుగడ,పినపాక
సహకార సంఘము పినపాక నందు ఇటీవల చనిపోయిన సంఘ సభ్యుడు జలగం పెంటయ్య కి అతని పేరుతో వచ్చిన ఇన్సూరెన్స్ సొమ్ము ను రూ. 50000/- యాభైవేలరూపాయలు అతని భార్య జలగం లక్ష్మి కి సంఘ అధ్యక్షులు రవి వర్మ అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంఘం నందు తీసుకున్న ఋణములు చెల్లించి అప్పులను రెన్యువల్ చేసుకోవలసినదిగా కోరినారు. ఈ కార్యక్రమంలో సంఘ సీఈవో రాంబాబు, సంఘ సిబ్బంది వెంకటేశ్వర్లు , నాగరాజు ,సునీల్,సత్యం , రైతులు పాల్గొన్నారు.
Post A Comment: