👉చుంచుపల్లి మండలం, రామాంజనేయ కాలనీ గ్రామంలోని సర్వే నంబర్ 137/1 లోని 18 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఆదివాసులకు మరియు పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే పంపిణీ చేయాలి
మన్యం టీవీ కొత్తగూడెం జూలై 12 :- చుంచుపల్లి మండలం, రామాంజనేయ కాలనీ పరిధిలోని 18 ఎకరాల ప్రభుత్వ స్థలంలో గత నాలుగు నెలల నుండి 2 వేల మంది భూ పోరాటం చేస్తున్న ఆదివాసులు మరియు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు పేర్కొంటూ 137/1 లో ప్రభుత్వ భూములు దాదాపు 2000 మంది ఆదివాసీలు పేదలు నేటి వరకు నివాసం ఉంటున్నారని ప్రస్తుతం అవి పట్టా భూములని కొంతమంది గిరిజనేతరులు తెచ్చిన హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా గుడిసెలను తొలగిస్తామని పోలీసులు ఆదేశాలు జారీ చేశారని, ఆ యొక్క భూములు పట్టా భూముల...? ప్రభుత్వ భూముల..? అనే అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని ఏదైతే అక్కడ నివాసం ఉంటున్నారో ఆ భూములు అన్నింటిని సమగ్ర భూ సర్వే చేసి ప్రభుత్వ భూముల్లో ఆదివాసులకు మరియు పేదలకు ఒక్కొక్క కుటుంబానికి 120 గజాల స్థలాన్ని పంపిణీ చేయాలని కలెక్టర్ ని కోరారు. కలెక్టర్ అనుదీప్ దీనిపై ఉన్నతాధికారులతో సర్వే నిర్వహించి ఆదివాసులకు, పేదలకు న్యాయం చేస్తాం అన్నారు.
ఈ ప్రతినిధి బృందంలో
ఆదివాసి ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ దొర
జిల్లా నాయకులు కంగాల జగన్,పద్ధం భుజంగరావు,వర్స నరసింహారావు,పాయం లక్ష్మినర్సు,ఎల్లబోయిన వీరన్న
గొగ్గల రమేష్, వజ్జ హరీష్, బాడిశ మోహన్,పూనం చంద్రయ్య,పడిగా శారద,పడిగా రాఘవులు,కుంజ రాంబాయి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: