CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతారామ ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్న గిరిజన రైతులు......

Share it:

 



సీతరామ ప్రాజెక్ట్ నిర్మాణ  క్యాంప్ వద్ద రైతుల ఆందోళన..

చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :

చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామం లో  సీతారామ ప్రాజెక్టు కాలువ కట్ట నిర్మాణం వల్ల మూడు సంవత్సరాలుగా తమ పంటలు నీట మునుగు తున్నాయని ప్రాజెక్ట్ అధికారులకు కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో  రైతులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా శుక్రవారం బెండాలపాడు గ్రామ శివారులో ఉన్న సీతారామ ప్రాజెక్టు  క్యాంపు వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు కావాలంటే చిన్నసన్న కారు రైతులందరూ భూమి ఇచ్చామని మిగిలిన కొద్దిపాటి వ్యవసాయ భూముల్లో కూడా పంట సాగు చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముత్యాలమ్మ చెరువు  కాలువ మా పొలాల మీద నుంచి కింద ఉన్న నాలుగు గ్రామాలకు పంట కాలువ ద్వారా నీళ్లు వెళ్ళెవని  సీతారామ కాలువ కట్ట నిర్మాణం చేపట్టడంతో పంట కాలువకు అడ్డుగా మట్టికట్ట అడ్డుగా వేయడంతో నీళ్లు ఎటూ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గిరిజనులకు సంబంధించిన సుమారు 300 ఎకరాల సాగుభూమి ప్రశ్నార్థకంగా మారిందని  ఇదే విషయాన్ని అధికారులకు కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేదేమీలేక  క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని  అధికారులు వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కారం చేయకుంటే  రైతులందరూ కలిసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువు ఆయకట్టు మాజీ చైర్మన్ కారం సైదులు, పీసా కమిటీ చైర్మన్ వర్స వీరభద్రం , గుంపెన సొసైటీ మాజీ వైస్ చైర్మన్ మేడా మోహన్ రావు, రైతులు సాయిబాబు, కనితి పుల్లయ్య, బచ్చల రమణ, కుంజా నరేష్, తేజావత్ వెంకన్న, కారం నాగరత్నం, కారం చిట్టి బాబు, చిన్న భద్రయ్య, పెద్ద భద్రయ్య, వర్సు సావిత్రి, మదనమోహన్, తోలెం విజయ్, పోడెం మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

 ఇదే విషయాన్ని డివిజన్ ప్రాజెక్ట్ మేనేజర్ గోపి రాజు మీడియా వివరణ కోరగా డిఈ ఆదేశాల మేరకు పనులు నిర్వహిస్తున్నామని  రైతుల సమస్యని డిఈ కి తెలియజేస్తామని అసంతృప్తి సమాధానం చెప్పారు.. 


రైతులు సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చారని తహశీల్దార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ ఏం ఉషా శారద, తెలిపారు. ప్రాజెక్టు సంబంధించిన వారితో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని రైతులు ఎవరు అధైర్యపడవద్దు అన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: