CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించిన అధికారులు

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు వ్యాపారస్తులకు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్-పి తిరుపతిరావు, ఎంపీడీవో-జి రేవతి సమావేశం నిర్వహించారు. వారు ఈ సమావేశంలో వ్యాపారస్తులుతో మాట్లాడుతూ ప్రధాన రహదారికి ఇరువైపులా ఆర్ అండ్ బి నిబంధనల ప్రకారం ఉండవలసిన స్థలాన్ని ఆక్రమిస్తూ, వ్యాపారాలు నిర్వహిస్తున్నారని. అందువలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, తక్షణమే వాటిని ఖాళీ చేయాలని అందుకు వ్యాపారస్తులు అందరూ సహకరించాలని , అంతేకాక గ్రామంలో పశువులను జాగ్రత్త చేయకుండా వదిలేసిన యజమానులకు, జరిమానా విధించబడును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ పద్మ, ఉప సర్పంచ్ పర్సా వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి-ఎస్కే ఖాదర్ మియా, వ్యాపారస్తులు, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: