మన్యం మనుగడ డెస్క్:
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మృతి చెందారు. అన్ని రకాల వైద్య సేవలు అందించిన్పటికీ, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. రెండు వారాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో కారు యాక్సిడెంట్ లో చికిత్స పొందుతూ కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్గా ఉండటంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. అక్కడే రెండు వారాలుగా కత్తి మహేష్కు చికిత్స జరుగుతుంది. తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
Post A Comment: