భాగస్వాములైన ఇండిజినియస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డాక్టర్ కపిల్ శర్మ
పినపాక ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణీ
మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని
ఉప్పాక పంచాయతీ కి చెందిన ఆదివాసీ గ్రామం ఎర్రగుంట. ఈ ఆదివాసీ గ్రామానికి స్వచ్ఛంద సంస్థలు అయిన ఇండిజీనియస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సామాజిక సేవకుడైన హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కపిల్ శర్మ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్లు, నిత్యావసరాల పంపిణీ చేయడం జరిగింది. ఆదివాసీ గ్రామమైన ఎర్రగుంట లో మొత్తం 26 కుటుంబాలు ఉండగా అన్ని కుటుంబాలకు వాటర్ ఫిల్టర్ లను, నిత్యావసరాలను, పౌష్టిక ఆహారం లేకుండా అనారోగ్యంగా ఉన్నటువంటి కుటుంబాలకు పౌష్టికాహారం సంబంధించిన పొట్లాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రగుంట గ్రామ పెద్ద అయిన ఎట్టి జై కుమార్ మాట్లాడుతూ, స్వచ్ఛంద సంస్థల వారికి తమ గ్రామం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నాడు. గతంలో కూడా తోలెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థల తరపున పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది అని గ్రామ ప్రజల అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల వాలంటీర్స్, ఎర్రగుంట గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: