CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: జిల్లా కన్వీనర్ మణుగూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ ఐటిఐ కాలేజీ లో ప్రవేశాల కోసం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డైరెక్టర్ కే వై నాయక్ ఆదేశాల మేరకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్,మణుగూరు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ బడుగు.ప్రభాకర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2021 ఆర్థిక సంవత్సరంలోని ప్రవేశాల కోసం ఈనెల 14 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లోని మొత్తం 5 ట్రేడ్స్ ఉన్నాయన్నారు.ఫిట్టర్,ఎలక్ట్రిషన్,డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, డీజిల్ మెకానిక్,కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెన్స్ కోపా, కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు.వీటిలో ప్రవేశాల కోసం కనీసం 10వ తరగతి పాసై ఉండాలని తెలిపారు. వయస్సు 2021 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి అన్నారు.గరిష్ట వయస్సు కు ఎటువంటి నిబంధనలు లేవు అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 14 నుంచి 28వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తమ ఒరిజినల్ ధ్రువపత్రాలు ఆన్ లైన్ లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారు.రాష్ట్రంలోని అన్ని ఐటీఐ లకు కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలన్నారు.మీకు ఇచ్చిన ఆప్షన్లలో ఎన్ని ఐటీఐ కోర్సులకైనా అప్షన్ ఇవ్వడం ద్వారా సీటు తప్పకుండా పొందే అవకాశం ఉంటుందన్నారు.సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సమీపంలో, అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఐటిఐ లో ఆప్షన్ పెట్టుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు *https://iti.telangana.gov.in* వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి అని ప్రిన్సిపాల్ బడుగు.ప్రభాకర్ తెలిపారు.

Share it:

Post A Comment: