మన్యం, టీవీ అశ్వాపురం:కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గొందిగూడెం వెళ్లే మార్గంలో గల ఇసుకవాగు వరద ప్రవాహానికి వాగుపై గల సప్టా ధ్వంసం కావడంతో గొందిగూడెం,గొందిగూడెం కొత్తూరు,ఎలకలగూడెం,మనుబోతులగూడెం పంచాయితీ ప్రజల రాకపొకలకు ఇబ్బందిగా మారడంతో ఈ రోజు అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత మండల అధ్యక్షులు కోడి అమరేందర్ ఆ ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు చొరవతో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిదులు మంజూరు చేసారని నిర్మాణ నిమిత్తం టెండర్లకు పంపారని రానున్న దసరా వరకు ప్రజల కష్టాలకు స్వస్తి పలుకుతామని కావున ప్రజలు అదైర్య పడకుండా సహకరించాలని ఎంపీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షులు కోడి అమరేందర్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,సర్పంచులు పాయం భద్రమ్మ,పర్షిక సూరిబాబు,కలెటి నర్షింహరావు,ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ.పంచాయితీ కార్యదర్శి నాగేశ్వరరావు,అశ్వాపురం సహకార సంఘం డైరెక్టర్ జలేందర్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,గ్రామ పెద్దలు గొంది గోపాలక్రిష్ణ,పాయం సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: