CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల పరిరక్షణకై చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయండి

Share it:

 


 న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం

 గుండాల జూలై 6 (మన్యం టీవీ) పోడు భూముల పరిరక్షణకై చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. గిరిజనులు నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూములను తక్షణమే వదిలేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఇంతవరకు పరిష్కారం చూప లేదన్నారు. ఈనెల ఎనిమిదో తారీఖున తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, పీ వై ఎల్ నాయకులు రవి, అరెం నరేష్ ,వై వెంకన్న , మంగయ్య , పెంటన్న , ఈ సం కృష్ణ , దుగ్గి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: