మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూసపల్లి ప్రభుత్వ పాఠశాలల లో మధ్యాహ్న భోజన వర్కర్ గా పనిచేస్తున్న మేకల నర్సమ్మ (సీఐటీయు) నాయకురాలు కరోనా మహమ్మారి బారినపడి అర్థరాత్రి మరణించింది.కుటుంబ సభ్యులు సీపీఎం హెల్ప్ లైన్ ను అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కోరారు.
స్థానిక తిలక్ నగర్ గ్రామపంచాయితీ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో సీపీఎం పార్టీ నేతలు అబ్ధుల్ నబీ,తాళ్లూరి కృష్ణ, కారం సంజీవయ్య, మొలుగు శ్రీనివాస్, సర్వన్ కుమార్,పాసి,గ్రామపంచాయితీ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పంచాయితీ కో ఆప్షన్ సభ్యులు హరికృష్ణ, గ్రామ పెద్దలు దనసరి రాజు,కుటుంబ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.
Post A Comment: