CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామకంఠం భూమి ని ప్రభుత్వం స్వాధీనపరచు కోవాలి.

Share it:

 


గిరిజనులు డిమాండ్


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


మండల పరిధిలోని  పోకలగూడెం గ్రామ పంచాయతీలో గత సంవత్సరం 11 ఎకరాల 20 కుంటల గ్రామకంఠం భూమి ఉన్నదని గుర్తించి దానికి సరిహద్దులు నిర్ణయించారు. అందులో కొంత భాగాన్ని పల్లె ప్రకృతి వనానికి వినియోగించుకుని మిగతా భూమికి ట్రెంచ్ వేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు గ్రామకంఠం భూమి కబ్జా చేసి ఫెన్సింగ్ వేసుకున్నారు. మరికొందరు అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇటువంటి వారి వల్ల గ్రామపంచాయతీ పరిధిలోని నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక,ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వ భూమి లేదనే సాకుతో గ్రామ పంచాయతీలో ఇండ్లు కట్ట లేకపోయారు. దీంతో ఎంతోమంది నిరుపేదలకు అన్యాయం జరుగుతుందన్నారు, ఇట్టి విషయంపై గ్రామకంఠం భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిపించాలని పంచాయతీ పరిధిలోని సుమారు వంద కుటుంబాల వారు తహసిల్దార్  ఎం ఉష శారద ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో.. మూడు బాలాజీ నాయక్, గుగులోత్ మోహన్ నాయక్, గుగులోత్ చందర్ నాయక్, గుగులోత్ నగేష్, బూరుగు రాము, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: