CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముదిగొండ వీరుల త్యాగం వృధా కాదు : సిపిఎం

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఉండటానికి ఇల్లు కావాలని అడిగిన నిరుపేదలకు అప్పటి వైయస్సార్ ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా పోలీసులతో కాల్పులు జరిపించి ప్రాణాలు తీయించిందని అమరవీరుల త్యాగాలు వృధా కావని సిపిఎం పార్టీ ఇల్లందు మండల సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య అన్నారు. బుధవారం నెహ్రూ నగర్ శాఖ మహాసభను ఉద్దేశించి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసిందని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, విద్యుత్ పోరాటంలో లో ప్రాణాలు కోల్పోయిన ప్పటికీ లక్ష్యాన్ని చేదించడం లో సిపిఎం పార్టీ ముందువరుసలో ఉండి పోరాడుతుందని గుర్తు చేశారు. ముదిగొండ మృతవీరుల పోరాట ఫలితమే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇన్లు మంజూరు చేసిందని తెలిపారు.కెసిఆర్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయుటకు కృషిజరపాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ ఏ నబి,మండల కార్యదర్శి తాళ్లూరికృష్ణ,ఆలేటి కిరణ్, మన్నే మోహన్ రావు, సభ్యులు ఆర్ విజయ రాజు,హరిలాల్, మమత, కాంతమ్మ,సువార్త, బహుదూర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: