మన్యం టీవీ, కొత్తగూడెం, జులై 10 :- శనివారం నాడు
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం సింగరేణి పాఠశాలలో జరిగిన అధిక జనాభా పెరుగుదల అవగాహన సమావేశం సింగరేణి ఎడ్యుకేషన్ జి ఎం పద్మానాభరెడ్డి, ఆదేశాలతో భారత ప్రభుత్వ స్వర్ణోత్వం "భారత్ అమృత్ మహోత్సవం "లో భాగంగా హెచ్ ఎం పూల్ సింగ్, పాఠశాల కస్పాండెంట్ అజయ్ కుమార్, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఏ శ్రీనివాసరావు, మాట్లాడుతూ,ఆరోగ్యమంతమైన సమాజం అభివృద్ధి కి జనాభా ఎంతో ప్రభావం చూపుతుంది అని తెలియజేశారు,మరియు సిరా ప్రసన్న, హెచ్ఎం పూల్ సింగ్ మాట్లాడుతూ జనాభా కుటుంబ జీవనానికి పునాది అని కావున ప్రణాళిక మైన కుటుంబం సామాజిక హక్కు గా ఎదగాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జయమ్మ,అరుణ,కల్యాణి, ప్రశాంత్,వెంకటేశ్వరరావు, సబెరా,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: