CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూముల నుంచి పోడు సాగుదారులను వెళ్ళగొట్టడం పల్లె ప్రగతి కాదు- సిపిఎం పార్టీ

Share it:

 


👉 ఎన్ఆర్ఐ లకు కాదు, పేద రైతులకు ఇవ్వాలి రైతుబంధు

 మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:- సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు.- కొండపల్లి శ్రీధర్. అన్నపురెడ్డిపల్లి మండలంలోని  బుచ్చనగూడెంలో గ్రామంలో సవలం కృష్ణ అధ్యక్షతన జరిగిన,  సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతు చట్టాల పేరుతో రైతులను భూముల నుండి  వెళ్ళ గొట్టాలని చూస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఫారెస్ట్ ,పోలీస్ అధికారులను వుసుగొల్పి, దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న పోడు సాగు దారులను, భూముల నుంచి వెళ్ళా కొడుతున్నాడని, పేద గిరిజనులను భూమి నుంచి వెళ్లగొట్టడం. పల్లె ప్రగతి కాదని, 2015 సం" లో ప్రారంభమైన పల్లె ప్రగతి దారిద్ర రేఖకు దిగువనున్న  నిరు పేదలను ఆర్థికంగా బలోపేతం చేయకపోగా, తెలంగాణ ప్రజలు ఒక్కరిపై 62వేల రూపాయల రుణభారం మోపారని, రైతుబంధు పథకంలో పేద రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పించలేదనీ, ఎన్నారైలకు,ధనిక రైతులకు మాత్రమే రైతుబంధు అమలు చేస్తున్నారని. గ్రామాలలో పేద రైతాంగం వ్యవసాయా పెట్టుబడి  కోసం వడ్డీ వ్యాపారులపై ఆధార  పడుతున్నారని, అందువల్ల పండించిన పంటను తిరిగి దళారులు నిర్ణయించిన రేటుకు రైతులు అమ్ముకుంటున్నారని, రైతుకు పెట్టుబడి సౌకర్యం కల్పించకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా ,పల్లె ప్రగతి పేరుతో హడావిడి చేస్తే పల్లె వెలుగు లక్ష్యం నెరవేరదని, ప్రపంచంబ్యాంకు కు మాత్రమే లాభం  జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి-జంగిలి వెంకటరత్నం సిపిఎం పార్టీ నాయకులు-తాటి సూర్యం, ముత్యం , సోయం సురేష్, తాటి శివ, కృష్ణ ,ప్రసాద్, కాక వీరభద్రం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: