ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
గుండాల జూలై 7 (మన్యం టీవీ) భూములు వదిలేస్తా మని డబ్బులు తీసుకున్నారని మామ కన్ను గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కడెం వెంకటేశ్వర్లు , గుండాల సర్పంచ్ కోరం సీతారాములు , టిడిపి నాయకులు గుండాల ఎంపీటీసీ సంధాని మాట్లాడుతు. భూములు వదిలేస్తా మని ఫారెస్ట్ అధికారులు 13 మంది రైతుల వద్ద మొత్తం 65 ఎకరాలకు ఎకరానికి ఐదు వేల చొప్పున వసూలు చేసి తరువాత హరితహారం మొక్కలు నాటేందుకు భూములను తీసుకున్నారన్నారు. ఉన్న మొత్తం భూమి ఫారెస్ట్ అధికారులు తీసుకుంటారన్న భయంతో వారు డబ్బులు అడుగుతే ఇచ్చామని గారు పేర్కొన్నారు. ఈ డబ్బుల వ్యవహారంలో గుండాల కాచన పల్లి రేంజ్ పరిధిలోని ఫారెస్ట్ అధికారులు తతంగం నడిపినట్టు వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారుల పై చర్యలు తీసుకోకుంటే హైకోర్టు వరకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని బాధితుల పక్షాన నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈ సం పాపారావు. న్యూ డెమోక్రసీ నాయకులు బాబు, మామ కన్ను గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: