మన్యం టీవీ ఏటూరునాగారం
భారత విద్యార్థి సమాఖ్య ఎస్ ఎఫ్ ఐ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏటూరునాగారం డిగ్రీ కళాశాల ముందు జిల్లా అధ్యక్షులు తోకల రవి ఆధ్వర్యంలో ఉన్నత విద్య అందించాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తోకల రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా లో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య చదవడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయని ఇప్పటికే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన జిల్లాలోని విద్యార్థులు ఉన్నత విద్యను చదవాలంటే వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అంత దూరం వెళ్లి చదువుకోవాలంటే ఆర్థికంగా కలిగి ఉండాలని కానీ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా పేద మధ్యతరగతి కుటుంబాలు అని అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు టెన్త్, ఇంటర్ వరకు చదివే ఆగిపోవాల్సి వస్తున్న పరిస్థితి అదే పద్ధతిలో ఉన్నత విద్య పీజీ, బీఈడీ మొదలగు ఉన్నత విద్యను చదవాలని ఆసక్తి ఉన్నప్పటికీ అందనంత దూరంలో విద్యా సంస్థలు ఉన్నాయని అందుబాటులో ఒక కాలేజీ కూడా లేకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం కావాల్సి వస్తుందని ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు దానికి పునాది పనులు కూడా తీయకపోవడం వల్ల గిరిజన విద్యార్థుల్లో ఆందోళన వస్తుందని ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ తోపాటు ఏటూరునాగారం కేంద్రంలో బీఈడీ, పి జి, బిపిడి, పాలిటెక్నిక్ లాంటి విద్య చదువుకోడానికి కాలేజీలు మంజూరు చేయాలని అన్నారు.లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అంకాన్ని వీర్రాజు, మార వంశీ, బొచ్చు రాంబాబు,వంశి,మురళి,శేఖర్, శ్యామ్,నవీన్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: