గుండాల జూలై 16 (మన్యం మనుగడ) తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ను తుడుందెబ్బ నాయకులు అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశవాపూర్ గ్రామంలో జరిగే నాగోబా జాతరలో కలిసి పోడు సమస్యపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. మామ కన్ను గ్రామంలో మరియు కిస్టాపురం గ్రామంలో గల పోడు భూముల సమస్యపై ఆయనకు వినతి పత్రం ఆంధ్ర దేశాలు. గత కొన్ని రోజులుగా మండలంలో పోడు సమస్య ఉధృతం కావడంతో తుడుందెబ్బ నాయకులు రాష్ట్ర అధ్యక్షుని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన సమస్యపై సానుకూలంగా స్పందించారని అన్నారు. ఆయనను కలిసిన వారిలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కడెం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రామస్వామి, ముక్తి రాజు, పాయం కాంతారావు ఉన్నారు
Post A Comment: