గుండాల ఎంపీపీ ముక్తి సత్యం
గుండాల జూలై 1 (మన్యం టీవీ) పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు పల్లె ప్రకృతి కార్యక్రమాన్ని సమిష్టిగా కలిసి విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. ప్రభుత్వం నాలుగో విడత పల్లె ప్రకృతి కార్యక్రమం జూలై ఒకటి నుండి ప్రారంభించిందని అందరూ బాధ్యతగా వ్యవహరించి కార్యక్రమం విజయవంతం అయ్యేవిధంగా కృషి చేయాలన్నారు. నాటిన మొక్కలన్నీ బతికే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. దానితోపాటు గ్రామాల్లో వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచేలా సర్పంచులు కార్యదర్శులు చూడాలని ఆయన కోరారు. సమిష్టిగా పనిచేయడంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాలి, సర్పంచ్ కోరం సీతారాములు, ఎంపీటీసీ సంధాని , ఉప సర్పంచ్ ఉపేందర్, వార్డు మెంబర్లు రెవిన్యూ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: