మన్యం టీవీ ఏటూరు నాగారం
అభయహస్త ఫౌండేషన్ అద్వర్యంలో తమ దత్తత గ్రామమైన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతలమోరి గుత్తికోయ గ్రామంలోని లెర్నింగ్ సెంటర్లో పిల్లలతో ఆటవిడుపు కార్యక్రమాలని నిర్వహించి, అక్కడ తరగతులు ఎలా జరుగుతున్నాయో సమీక్షించడం జరిగినది. అనంతరం ఫౌండేషన్ సభ్యులు పిల్లలకు కేక్ పాకెట్స్, స్మిలేకిట్స్ పంపిణి చేసి గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే అధికారుల దృష్టికి తీసుకు పోతామని అన్నారు. గ్రామంలో కొత్తగా వచ్చినవారికి ఆధార్ కార్డు, మరియు అంగన్వాడీ కేంద్రం వచ్చేలా సర్పంచ్ మరియు అధికారుల దృష్టికి తీసుకెళతాం అని అన్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే వ్యాధులనుండి ఎలా జాగ్రత్తగా ఉండాలో అవగాహనా కల్పించారు రు.కార్యక్రమంలో కార్తీక్ (ప్రెసిడెంట్), నిఖిల్ (ములుగు కోఆర్డినేటర్),చేతన్ (ట్రేసర్ర్), రాజు, సుజిత్, కార్తీక్, శివాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: