మన్యం టీవీ మణుగూరు:
జులై 24న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి.సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి అని,ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండలం, టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో సోమవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని జడ్పీటీసీ పొశం.నరసింహారావు మాట్లాడారు.ముక్కోటి మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అని కోరారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ కారం.విజయకుమారి,వైస్ ఎంపీపీ కె.వి.రావు,మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,పట్టణ యువజన అధ్యక్షులు రుద్రవెంకట్, ఎంపీటీసీ లు,కో అప్షన్ సభ్యులు,సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: