ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో డివైసిఎంఓ కు వినతిపత్రం అందజేత
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని పీవీ కాలనీ లో ఇటీవల డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సింగరేణి ఏరియా హాస్పిటల్ లో సంబంధిత వ్యాధి నివారణ చర్యలు,మెరుగైన వైద్యంతో పాటు కాలనీ లో దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని,అదే విధంగా వర్షాకాలం లో ప్రబలే సీజనల్ వ్యాధులకు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని, కరోనా వైరస్ పేషెంట్లకు క్వారం టైన్ సెంటర్లో సింగరేణి వైద్యులు,వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.కోవిడ్ ప్రత్యేక వైద్య సిబ్బందికి,వంట సిబ్బందికి,సకాలంలో జీతాలు ప్రత్యేక ఇన్సెంటివ్ చెల్లించాలని కోరుతూ ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏరియా హాస్పిటల్ ఉప ముఖ్య వైద్యా అధికారి మేరీ కుమారి ని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్డి.నాసర్ పాషా,ఏ. మంగీలాల్,డేగల.వంశీ,ప్రైవేటు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: