మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేట గ్రామ పంచాయతీ లో పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ మంజుల, గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మొదటి రోజు నుండి పదవ రోజు వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సమీక్ష చేసారు.ఈ సందర్బంగా స్పెషల్ ఆఫీసర్ మంజుల మాట్లాడుతూ పల్లె ప్రగతి లో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలి. వర్షకాలంలో నీరు నిలువ లేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి నీరు నిలువ ఉండే వస్తువులు తీసివేసి లేదా వాటిలోని నీరు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండేలా ప్రజలకు అవగాహనా కల్పించాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ మంజుల, సెక్రటరీ రాజశేఖర్, గ్రామ పంచాయతీ కారోబార్ మహేష్,అంగన్వాడీ టీచర్స్ మేరికమల, విజయలక్ష్మి, జాన్షిరాణి, ఆశ వర్కర్స్ పుణ్యవతి, విజయకుమారి, గ్రామ అభివృద్ధి కమిటీ మెంబెర్స్ కర్రి శ్యాంబాబు, గ్రామ ప్రజలు తదితరులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం సమీక్ష లో పాల్గొన్నారు.
Post A Comment: